ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతుగా జైపూర్ లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసలు, నరేంద్ర మోదీ ఏం తప్పు చేశారని ఆయన్ను ఓడించాలను కుంటున్నారని ప్రశ్నించారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి.. సొంత ప్రయోజనాలు లేని మోదీ లాంటి వ్యక్తికి దేశ ప్రజలందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ మళ్లీ అధికారం చేపట్టకుండా ఉండేందుకు కొన్ని ముస్లిం, క్రైస్తవ దేశాలు కోట్ల రూపాయలు పంపిస్తున్నాయని బాబా రామ్ దేవ్ మండిపడ్డారు.