ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా శ్రీప్రసన్నరామస్వామి రథోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 10:41 AM

శ్రీరామనవమి ఉత్సవాల సంధర్భంగా దేవాలయం బజారులో వేంచేసి ఉన్న శ్రీప్రసన్న రామస్వామి దేవస్థానం వద్ద బుధవారం ఘనంగా సీతారామలక్ష్మణుల రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పువ్వామ మురళీకృష్ణ, పాదర్తి వెంకటప్ర శాంత్‌లు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీసీతారామలక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథోత్సవ కార్యక్రమానికి సిద్దం చేయగా, ప్రసన్న రామస్వామి సేవాసంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ధర్మకర్త అచ్యుత పెద్ద వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు చక్కా మాలకొండ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఆరవీటి కేశవరావుతో పాటు కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com