శ్రీరామనవమి ఉత్సవాల సంధర్భంగా దేవాలయం బజారులో వేంచేసి ఉన్న శ్రీప్రసన్న రామస్వామి దేవస్థానం వద్ద బుధవారం ఘనంగా సీతారామలక్ష్మణుల రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పువ్వామ మురళీకృష్ణ, పాదర్తి వెంకటప్ర శాంత్లు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీసీతారామలక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథోత్సవ కార్యక్రమానికి సిద్దం చేయగా, ప్రసన్న రామస్వామి సేవాసంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ధర్మకర్త అచ్యుత పెద్ద వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు చక్కా మాలకొండ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఆరవీటి కేశవరావుతో పాటు కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.