ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమాఅన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు. 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని అన్నారు. స్పీకర్పై దాడి చేసింది కాక గవర్నర్కు అన్నీ అబద్ధాలే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్దేనని విమర్శించారు. చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ అధికారుల్ని ఇష్టానుసారంగా మారిస్తే విశ్రాంత అధికారులు ఏమైపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్ భూభాగంలో దొంగలు దొంగల కలిసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఓటు వేసిన మరుక్షణం పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్ తాము త్వరగా పోవాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశమేనని ధీమా వ్యక్తం చేశారు. చంచల్ గూడా జైలుకా? లేక చరపల్లి జైలుకా ? అనేది తేల్చుకోవాల్సింది జగన్ అని ఆయన సృష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో వైకాపా ఉందని జోస్యం చెప్పారు.