ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌లో బాంబు పేలుడు

international |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2019, 01:01 PM

ఓ పక్క ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూనే మరోపక్క తాము ఉగ్రవాద బాధితులమని నక్క వినయాలు ప్రదర్శించే పాక్ ఒక్కోసారి తనే ఆ రాక్షసికి బలవుతూ ఉంటుంది. తాజాగా క్వెట్టాలో జరిగిన బాంబు దాడే దీనికి నిదర్శనం. క్వెట్టాలోని ఓ మార్కెట్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 16మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 


మైనార్టీ తెగ అయిన షియా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. 


ఈ బాంబు దాడికి ఎవరూ బాధ్యత ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. షియా ముస్లిం వర్గంపై ప్రతీకారంగానే మరోవర్గం ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ దాడిపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి జమ్ కమాల్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవజాతికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com