రాజమహేంద్రవరం: రాబోయే తరానికి అండగా ఉండాలనే జనసేన పార్టీ స్థాపించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… రాబోయే తరానికి అండగా ఉండాలనే జనసేన పార్టీ స్థాపించానన్నారు. ఉన్నతమైన ఆశయాలతో అన్నయ్య ఆనాడు ప్రజారాజ్యం స్థాపించారన్నారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానన్నారు.