ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి మ్యానిఫెస్టో లోని ప్రధానాంశాలు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 02:58 PM

న్యూఢిల్లీ: రామ మందిర నిర్మాణ అంశాన్ని మరోసారి బిజెపి తన ఎన్నికల అస్ర్తంగా ప్రయోగించింది.. ఈరోజు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో లో రామమందిర నిర్మాణ అంశాన్ని చేర్చింది..  సంకల్ప్ పత్ర్ పేరుతో  బీజేపీ తాజా మేనిఫెస్టో ను ప్రధాని నరేంద్ర మోడి, బిజెపి చీఫ్ అమీత్ షాలు ఢిల్లీలో విడుదల చేశారు.




బిజెపి 2019 మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు 


 సైనిక బలగాలను బలోపేతం చేసేందుకు అవసరమైన రక్షణ సామగ్రిని త్వరితగతిన కొలుగోలు చేయడం


తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను కొనసాగించడం


దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దశల వారీగా జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేయడం


ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ ఫెన్సింగ్ సహా టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించడం


జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370తో పాటు.. ఆ రాష్ట్ర ఆస్తులపై బయటివారికి హక్కు లేకుండా చేసే ఆర్టికల్ 35-ఏ రద్దుకు కట్టుబడి ఉండడం


రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, వడ్డీలేని రుణాలు, రూ.1 లక్ష వరకు సున్నా వడ్డీతో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు, 1 నుంచి 5 ఏళ్ల పాటు అసలు ఖచ్చితంగా చెల్లిస్తామన్న హామీపై రుణాలు


130 కోట్ల మంది భారతీయుల ఆంకాక్షలను నిజం చేయడమే లక్ష్యంగా ‘సంకల్ప పత్రాన్ని’ అమలు చేయడం


బీజేపీ అధికారంలోకి రాగానే రామ మందిర నిర్మాణం


దేశంలో పూరిళ్లలో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు 2022 నాటికి పక్కా ఇళ్లు


2024 నాటికి మౌళిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు.


పేద, మధ్య తరగతి వారితో పాటు రైతులకు పించన్ అందజేత






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com