అమలాపురం: సామాజిక న్యాయం కోసం అందరూ మాట్లాడతారని, కానీ సామాజిక న్యాయం పాటించేది జనసేన ఒక్కటే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. పులివెందులలో దళితులను అణచివేస్తున్నారన్నారు. కులాలను వాడుకుని నాయకులు పెత్తనాలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను ఒక కులానికి పని చేసే వ్యక్తిని కాదన్నారు. అన్ని కులాలు, ప్రాంతాలను సమానంగా చూస్తానన్నారు. ఓట్ల కోసం తాను రాజకీయాలుచేయనన్నారు. జనసేనలో చేరమని ఎవరినీ అడగలేదన్నారు. తట త్రిమూర్తులను కూడా తాను ఆహ్వానించలేదన్నారు. జగన్లా పైకి ఒకటి, లోపల ఒకటి మాట్లాడనన్నారు. తనకు కుల పిచ్చి లేదని, కాపు కులంపై గౌరవం ఉందన్నారు. కులాలను కలుపుతూ అభివృద్ధి చేయాలన్నదే జనసేన ఉద్దేశమన్నారు.