21 ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ తరవాత ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఒక్కొక్క నియోజకవర్గం నుండి కనీసం 50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వలన ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నాయి. కానీ ఆలా చేస్తే వలన ఫలితాలు 6 రోజులు ఆలస్యంగా వెల్లడవుతాయని, గతంలో లెక్కించినట్టే ఒక్కో నియోజకవర్గం నుండి ఒక్క వివిప్యాట్ను మాత్రమే తీసుకుని లెక్కిస్తామని ఎలక్షన్ కమీషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం కోర్టు లెక్కించాల్సిన వివిప్యాట్ల సంఖ్యను ఒకటి నుండి ఐదుకు పెంచింది. అనగా ఈసారి ఒక్కో నియోజకవర్గం నుండి 5 వివిప్యాట్లను ర్యాండమ్ పద్దతిలో ఎంపిక చేసి లెక్కిస్తారన్నమాట.