పసుపు-కుంకుమ అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు ఎన్నికల ముందే ప్రజలు గుర్తొస్తారన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో పెండింగ్ పనులు పూర్తి కాలేదన్నారు. సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించారని విమర్శించారు. ఇవాళ ధర్మానికీ, అధర్మానికీ యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు ప్రతి రోజు కుట్రలు చేస్తున్నారన్నారు. గ్రామాలకు చంద్రబాబు మూటల్లో డబ్బులు పంచుతున్నారన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దన్నారు.