విజయవాడ : కృష్ణలంక దగ్గర జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి గాల్లోకి లేచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.