కేంద్రంలోని ప్రభుత్వ బలహీనత వలన ఉగ్రవాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసారు ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఏ.పాల్. శుక్రవారం ఓ ఛానల్లో ఆయన మాట్లాడుతూ. ఉగ్రవాదుల చర్యల ను తీవ్రం గా ఖండించారు. 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వాల తను మాట్లాడతానని, పాకిస్థాన్, భారత్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికలలో పోటీకి అంతా సిద్దమేనని, దోచుకోవడం దాచుకోవడం అలవాటైన పార్టీలు ఇక 75 రోజులు మాత్రమే ఉంటాయని అన్నారు. టీడీపీ , వై సిపి లు రెండు ఓటమి పార్టీలేనని ఈ మార్చ్ లో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులలో మార్పులు రావటం తథ్యమని, ఏప్రిల్ లో ఎన్నికలలో తమ పార్టీ సీట్ల సునామీ చూపించి మే లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ మహిమ ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. శనివారం సాయంత్రం తన పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పిన ఆయన లమ పార్టీకి చూస్తేనే వోట్ వేయలనిపించే హెలికాఫ్టర్ గుర్తు వచ్చిందని ఇది గ్లాస్ లా పగలదు, ఫ్యాన్ లా తుప్పు పట్టదు, తొక్కి తొక్కి కూలదన వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, హెలికాఫ్టర్ గుర్తు చూపారు