సార్వత్రిక ఎన్నిలకు దగ్గరపడే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బలమైన నాయకులు కూడా పార్టీులు మారుతున్న పరిస్దితి కనపడుతుంది. మొత్తం మీద ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దానికి నిదర్శనం గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచనం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ‘కాసు కృష్ణారెడ్డి’ కుటుంబంలో త్వరలో టీడీపీలో చేరబోతోంది. వచ్చే వారం రోజుల్లో ఈ చేరిక ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లాలో పట్టున్న ‘కృష్ణారెడ్డి’ కుమారుడు ‘మహేష్రెడ్డి’ ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. ఆయన ‘గురజా’లలో పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ‘మహేష్రెడ్డి’ని పార్టీలో చేర్చుకునేటప్పుడే ఆయనకు ‘గురజాల’ టిక్కెట్ ఇస్తానని తెలిపారు తనకు ‘గురజాల’ కన్నా..’నర్సరావుపేట’ అయితే సౌకర్యంగా ఉంటుందని ‘మహేష్రెడ్డి’ చెపితే టిక్కెట్లు సంగతి అప్పుడు చూసుకుందామని ‘జగన్’ చెప్పడంతో ‘గురజాల’ ఇన్ఛార్జిగా ‘మహేష్రెడ్డి’ కొనసాగుతున్నారు. అయితే ఎన్నిక సమయంలో తనకు ‘నర్సరావుపేట’ టిక్కెట్ కావాలని, ‘మహేష్రెడ్డి’ పట్టుపట్టినా, ‘గురజాల’ నుంచే పోటీ చేయాని ‘జగన్’ ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఇక తాను పార్టీలో ఉండలేనని, ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ‘టీడీపీ’ నుంచి కూడా ‘కాసు’ కుటుంబానికి ఆహ్వానం ఉండడంతో ఇప్పుడు వైసీపీను వదుకుని టీడీపీలోకి రావాని తండ్రీకొడుకు నిర్ణయించుకున్నారని తొస్తోంది. ‘కాసు’ కుటుంబం ఇప్పటికే ‘చంద్రబాబు’తో పుసార్లు సమావేశమైంది. ‘నర్సరావుపేట’ సీటు ఇస్తే తాము టీడీపీలోకి వస్తామని చెప్పడంతో..‘చంద్రబాబు’ స్పీకర్ కోడెల శివప్రసాద్తో దీనిపై చర్చించారు. వారు వస్తే తనకేమీ అభ్యంతరం లేదని ఇతర నాయకు/ చెప్పడంతో ఇప్పుడు ‘కాసు’ కుటుంబాన్ని చేర్చుకోవడానికి ‘చంద్రబాబు’ సుముఖత వ్యక్తం చేశారని, నేడో రేపో ఆ కార్యక్రమం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.