వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కుల రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును పొగిడిన అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్.. ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడిన నేతలకు ప్రజాదరణ లేదని, సీటు రాదనే భయంతోనే వెళ్లిపోయారని సాధినేని యామిని విమర్శించారు.