ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్తెనపల్లిలో ప్రతిపక్షాల నేతలు అరెస్ట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 12:18 PM

 సత్తెనపల్లిలో ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోడెల అతని కుటుంబ సభ్యుల అక్రమాలపై న్యాయ విచారణ చేయాలంటూ.. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో గుంటూరు సత్తెనపల్లిలో శుక్రవారం ధర్నా చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి నేతలను ముట్టడించారు. పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. రోడ్డుపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి రాజుపాలెం, బెల్లంకొండ లోని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com