సత్తెనపల్లిలో ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడెల అతని కుటుంబ సభ్యుల అక్రమాలపై న్యాయ విచారణ చేయాలంటూ.. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో గుంటూరు సత్తెనపల్లిలో శుక్రవారం ధర్నా చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి నేతలను ముట్టడించారు. పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. రోడ్డుపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రాజుపాలెం, బెల్లంకొండ లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.