జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఉగ్రవాదులు జవాన్లపై ఐఈడీతో దాడికి పాల్పడ్డారు. గోరిపొర వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో 8మంది జవాన్లు గాయాలయ్యాయి. ఐఈడీ పేలుడు తర్వాత ఉగ్రవాదులు బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ జైషే-ఈ మహ్మద్ ప్రకటించింది.