చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రత్యేకహోదా కావాలని కోరుతూ పార్లమెంట్ రకరకాల వేషధారణలుతో నిరసన తెలిపారు. దీనిపై నిన్న సభలో స్పందించిన మోడీ శివ ప్రసాద్ మంచి నటుడని.. చిత్ర విచిత్ర వేషాలతో అందరినీ నవ్విస్తారని.. నేను కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్న అయనను చూడగానే అన్నీ మర్చిపోతానన్నారు. దీనిపై స్పందించిన శివ ప్రసాద్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. మోడీ ఓ కళాకారుడిని వ్యంగ్యంగా మాట్లాడ్డం ఆయనకే చెల్లిందని.. అయన ఎలా మాట్లాడినా ఆయన ప్రసంశలు మనకు అక్కర్లేదని.. ప్రత్యేకహోదా కావాలన్నారు. మోడీ ఇచ్చే రివార్డులు, అవార్డులు కాదు కావల్సింది.. మనకు ప్రత్యేకహోదా అన్న అయన ముందు దానిపై ఇచ్చిన హామీల సంగతి తేల్చి తర్వాత అయన మాట్లాడితే బాగుంటుందన్నారు.