ప్రధాని మోదీ దాదాపు నాలుగు గంటల సేపు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు డెహ్రాడూన్ లోని జోలీ గ్రాన్ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలుపడలేదు. దీంతో, విమానాశ్రయంలోనే ఆయన ఉండిపోయారు. పరిస్థితి మెరుగుపడిన అనంతరం ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు. విమానాశ్రయంలోని ఓ ప్రత్యేక గదిలో ప్రధాని ఉన్నారని అధికారులు తెలిపారు.