ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు మృతి చెందిన బీటెక్‌ విద్యార్థి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:16 PM

గుత్తి పట్టణ శివారులోని గేట్స్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థి సాయిధనుంజయ(22) మూర్ఛతో మృతి చెందాడు. యాడికి మండలానికి చెందిన పోలారంగస్వామి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయిధనుంజయ గేట్స్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్నాడు. కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో అతడికి మూర్ఛ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి తేరుకుని హెచఓడీ పర్మిషన తీసుకొని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. కళాశాల గేటు వద్దకు రాగానే కింద పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com