ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం అక్రమాలను వెలికి తీసే పనిలో సీఐడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:04 PM

మద్యం అక్ర మాలను వెలికి తీసే పనిలో సీఐడీ దూకుడు పెంచింది. తూర్పు గోదావరి జిల్లాలోని డిస్టలరీలలో మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిం దే. మంచి బ్రాండ్లను ఆపేసి సొంతంగా మద్యం తయారుచేసి సొంత పేర్లతో నాసి రకం మద్యం విక్ర యించారు. డిజిటల్‌ లావా దేవీల ఊసే లేకుండా నగదు రూపంలో అ మ్మకాలు చేసి లెక్కపత్రం లేకుండా వైసీపీ పెద్దలు దోచుకున్నారు. జిల్లాలో నెలకు రూ.150 కోట్లకు పైగా వ్యాపారం జరిగేది. కూటమి అధి కారంలోకి రావడంతో మద్యం పాలసీని మార్చింది. దీంతో అప్పటి అక్రమాలపై దర్యా ప్తును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.


ఇప్పటికే గతంలో వ్యవహారం నడిపిన ఉన్నతస్థాయి అధికారుల మెడకు ఉచ్చు బిగి సింది.అసలు ఈ అక్రమాల వెనుక ఎవరున్నారు.. ఎంత మేర అక్రమాలు జరిగాయనేది తేల్చడానికి సీఐడీ అధికారులు ఏకకాలంలో సోమవారం అన్ని చోట్ల సోదాలు మొదలు పెట్టారు.రాజమహేంద్రవరంలోని సీఐడీ రీజనల్‌ ఆఫీసు నుంచి ఏఎస్పీ హస్మా ఫర్వీన్‌ ఆధ్వర్యంలో సీఐడీ డీఎస్పీలు, సీఐలు, ఇతర సిబ్బంది, ఎక్సయిజ్‌ అధికారులు తదితరులు తనిఖీలు చేస్తున్నారు. కానీ ఏవిధమైన సమా చారం బయటకు చెప్పడం లేదు. లోపలకు వెళ్లి గేట్లకు తాళాలు వేసి తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో రంగంపేట మండలంలోని నల్ల మిల్లిలో ఫ్రాగ్‌ మద్యం పరిశ్రమ, కోటపా డులోని మద్యం బాట్లింగ్‌ యూనిట్‌, అనపర్తి మండలం కొప్పవరం బీడీహెచ్‌ ఆగ్రో వెం చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ తనిఖీలు జరు గుతున్నాయి. తాళ్లపూడి మండలం తుపాకుల గూడెంలో కూడా డిస్టిలరీ ఉంది. వైసీపీ హయాంలో భూంభూం బ్రాండ్‌ ఇక్కడ నుంచి వచ్చేదని సమాచారం. ఇక్కడ గతంలో ఏఏ బ్రాండ్లు తయారు చేసేవారు.. వైసీపీ హయాంలో ఏ బ్రాండ్లు తయారు చేశారు. ఎక్కడ నుంచి సరుకు వచ్చేది తదితర వివరాలు సేకరిస్తున్నారు. అప్పటి రికార్డులన్నీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డిస్టిలరీల నిర్వా హకులను ఎక్కడికి కదలకుండా చేయడంతో పాటు అక్కడ పనిచేసేవారిని కూడా అదుపు చేసి వివరాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. సీఐడీ అధి కారులు మాత్రం తాము చేస్తున్న సోదాల గురించి లీకులు ఇవ్వడంలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com