ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ అనుకోని యువకుడిని చితకబాదిన గ్రామస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 10:49 PM

శ్రీకాకుళం జిల్లా, మందస మండలం సొండిపూడి గ్రామంలో ఒక యువకుడిని దొంగగా అనుమానించి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసు లకు అప్పగించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి బైక్‌పై గ్రామంలోకి వచ్చిన ఓ యువ కుడిని స్థానికులు వివరాలు అడుగ్గా అతడు చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో దొంగగా భావించి కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.


అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని స్టేషన్‌ కు తరలించారు. వివరాలు ఆరా తీసి ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన వ్యక్తిగా నిర్థారించి అతడి తల్లిదండ్రులకు పిలిపించి అప్పగించారు. ఎస్‌ఐ ఖాదర్‌భాషా మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తొందరపడి ఎలాంటి దాడులకు పాల్పడ వద్దన్నారు. స్థానిక యువత సమనయం పాటిం చాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com