ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిట్స్‌ వచ్చి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 10:48 PM

తండ్రి దినకర్మ రోజునే కుమారుడు మృతి చెందిన సంఘటన పాలకొండలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని గాయత్రీనగర్‌లో నివాసముంటున్న విశ్రాంత ఎంఈవో పొదిలాపు రామినాయుడు ఇటీవల మృతిచెందిన విషయం విదితమే. కాలనీలో ఆయన పెద్దకర్మ బుధవారం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.


ఇంతలో రామినాయుడు చిన్న కుమారుడు చంద్రశేఖర్‌నాయుడుకు (బుజ్జి) మంగళవారం రాత్రి ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి దినకర్మరోజేనే కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. కాలనీతో పాటు పాలకొండలో విషాదఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com