ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 12:47 PM

బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాధ రెడ్డి గురువారం పలువార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. అకాల వర్షాల కారణంగా వార్డుల్లో నిలిచిపోయిన నీరు పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్, 3, 7 వార్డులు, రాజీవ్ గాంధీ నగర్, యానాది కాలనీ, ఇందిరానగర్ ప్రాంతాలలో పర్యటించారు. వార్డుల్లో పారిశుధ్యం సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com