ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 03:44 PM

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. డీఏ పెంపునకు సంబంధించి ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పేర్కొంది.ఈరోజు ఉదయం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు డీఏ పెంపుకు ఆమోదం తెలిపారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నిర్ణయంతో కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం సాధారణంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉద్యోగుల డీఏను పెంచుతుంది.పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను అందిస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచింది. పెంపుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత... ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com