అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు బుధవారం బాపట్లలో జాయింట్ కలెక్టర్ ప్రకర్ జైన్ ను కలసి పంగులూరుకు చెందిన వివోఏలు గొళ్ళ సుభాషిణి, షేక్ మీరాబీ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అందజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మండలంలో నిబంధనలకు విరుద్ధంగా వివోఏలను తొలగించారని హేబేలు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని కోరారు.