ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ హనీ ట్రాప్‌ కేసులో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 07:05 PM

విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న యువతితో పాటు ఆ గ్యాంగ్ ఎంతోమందిని ట్రాప్ చేసినట్లు తేలింది. ఆ గ్యాంగ్ చేతిలో తాను నరకం అనుభవించానని ఓ యువకుడు ఫోటోలతో సోషల్ మీడియాలో ఆరోపించారు. ఆ యువతి పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుందని చెబుతున్నారు. యువతి పైకి ప్రేమ నటిస్తూ తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడిపింది. ఆమె అర్ధరాత్రి సమయంలో బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హడావిడి చేస్తున్నట్లు తేలింది.


అంతేకాదు ఆ యువతి తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెప్పి అమాయకుల్ని మోసం చేస్తోంది. తనకు ఎంతోమంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయం ఉందని చెప్పుకుని.. చాలామందిని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పది నెలల క్రితం ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించినట్లు గుర్తించారు. అప్పుడు ఆమె మోసాలను పోలీసులు గుర్తించలేకపోయారు.. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎంతోమందిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆమె మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మోసాలు బయటపడుతున్నాయి.


ఆ యువతి పారిశ్రామికవేత్తలు, డబ్బున్నవాళ్లు, అధికారులు, ఎన్నారైలను టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేది. ఆమె అందమైన ఫోటోలను మొగ్గులోకి దింపేది.. ఆ వెంటనే రూమ్‌కు పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి న్యూడ్ ఫోటోలు తీసి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. యువతి బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారైలతో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకు రాగా.. మరికొందరు తమ వివరాలు చెప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


ఇటీవల మరో ట్విస్ట్ బయటపడింది. ఓ యువకుడు తనపై అత్యాచారం చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసులుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పుడు ఆ యువకుడు యువతిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుకావడం విశేషం. ఈ కేసులో యువతిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం మాత్రమే కాదు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా బాధితులు ఉన్నట్లు సమాచారం.


అలాగే ఆ యువతితో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లోని డేటా కీలకంగా మారగా.. ఆమె బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ పే వంటి నగదు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి ఫోటో షూట్‌ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకోగా.. వారి గురించి ఆరా తీస్తున్నారు.. ఆమెతో ఉన్న గ్యాంగ్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మొత్తానికి విశాఖపట్నం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com