ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్షన్ పెట్టిన ఎయిరిండియా విమానం.. అందరూ సేఫ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:08 PM

తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అందరినీ టెన్షన్ పెట్టింది. 144 మంది ప్రయాణికులతో AXB 613 ఎయిరిండియా విమానం తిరుచ్చి నుంచి షార్జాకు బయల్దేరింది. సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు తిరుచిరాపల్లి నుంచి షార్జాకు ఈ ఎయిరిండియా విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అందరిలోనూ ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అవుతుందా కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో మరింత భయాందోళనలు పెరిగాయి.


అయితే ఎయిరిండియా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు పైలెట్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఏటీసీ సలహాల సాయంతో పైలెట్లు ఎయిరిండియా విమానాన్ని సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు.మరోవైపు ప్రతికూల పరిస్థితులు తలెత్తితే ఎలా అనే అనుమానాలతో ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. విమానాశ్రయం వద్ద 20 అంబులెన్సులు, 20 ఫైరింజన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పారామెడికల్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో విమానం సేఫ్ ల్యాండింగ్‌ కావాలంటే.. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఓ స్థాయికి తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం పైలెట్లు ఎయిర్‌పోర్డు వద్ద ఎయిరిండియా విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. సుమారు రెండున్నర గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఎయిరిండియా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


మరోవైపు ఈ రెండు గంటలపాటు విమానంలోని 144 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విమానంలో తమ వాళ్లు ప్రయాణిస్తున్నారనే విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందారు. అయితే పైలెట్ల అప్రమత్తత అందరినీ సురక్షితంగా కిందకు చేర్చింది . సుమారుగా రెండున్నర గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత సేఫ్‌గా కిందకు దిగింది. దీంతో విమానంలోని 144 మంది ప్రయాణికులతో పాటుగా విమానాశ్రయ వర్గాలు, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com