ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ దేశం గొప్ప మానవతావాదిని కోల్పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 11:02 PM

రతన్ టాటా మృతి పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటన్నారు. ఆయన గురించి తెల్సుకోవాల్సినది చాలా ఉంది. ఈ దేశం గొప్ప మానవతావాదిరని కోల్పోయిందన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని... ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని చెప్పుకొచ్చారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగిగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com