ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్ టాటా చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇదే.. రెండు రోజులకే

national |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 09:54 PM

 వృద్ధాప్యం, అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా లేరన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె రతన్ టాటా ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉందనే వార్తలు.. మీడియా, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దీంతో రతన్ టాటా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఒక పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది.


అయితే రెండు రోజుల క్రితం వరకు రతన్ టాటా ఆరోగ్యంపై విపరీతమైన వదంతులు వచ్చాయి. హాస్పిటల్‌లో రతన్ టాటా ప్రాణాలతో పోరాడుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోమవారం ఒక పోస్ట్ పెట్టారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఎన్నో రకాల పుకార్లు వ్యాపిస్తున్నాయని తనకు తెలుసని.. అయితే అవన్నీ నిరాధారమైనవని అందరికీ చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. తనకు వయసు పైబడటంతో వివిధ రకాల అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం తాను మెడికల్ టెస్ట్‌లు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


అయితే ఆస్పత్రి నుంచి తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రతన్ టాటా.. ఇలా కన్నుమూయడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. ఇక ఈ విషయాన్ని టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. ఇక రతన్‌ టాటా మృతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్‌ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రికి వెళ్లిన రిలయన్స్‌ అధినేత ముకేష్ అంబానీ వెళ్లారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com