ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి టీడీపీ ఎంపీ, మహిళా ఎమ్మెల్యే బహుమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:45 PM

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ చేతులమీదుగా వస్త్రాలను అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.


తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బందికి ఆదివారం సేలంకు చెందిన మెక్కినేశ్వరి టెక్స్టైల్స్ అధినేత తంగదొరై దంపతులు వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేతులమీదుగా వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.


తిరుమలలో గరుడ సేవ విజయవంతం


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవను టీటీడీ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జెశ్యామల రావు తెలియజేశారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన రాంభగిచా రెస్ట్ హౌస్ వద్ద టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ చాలా బాగా పని చేసిందనీ, మరుగుదొడ్ల విషయం మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు ఈవో. గరుడ సేవ అయిపోయిందని ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండకూడదని, మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత అధికంగా ఉందని, వచ్చే బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లోని భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


ప్రతి వాహన సేవను కూడా గరుడ సేవ లానే భావించి సేవలు అందించాలన్నారు అడిషనల్ ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి . రాబోయే రోజుల్లో గ్యాలరీల వద్ద మరిన్ని శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాలరీ సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించి చర్యలు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాలకు అనుభవం ఉన్న శ్రీవారి సేవకులను తీసుకుంటే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మాడ వీధుల్లో భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై గందరగోళం ఉందని దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గరుడ వాహన సేవలో క్యాటరింగ్ విభాగం చాలా బాగా పని చేసిందని అభినందించారు. విజిలెన్స్ సిబ్బంది కూడా సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించారన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com