ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రి ప్రజల సహకారం మర్చిపోను: నారా భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 03:43 PM

తమ కుటుంబానికి రాజమండ్రి ప్రజలు అందించిన సహకారం తాను ఎప్పటికీ మర్చిపోనని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్​ మేనిజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. రాజమండ్రిలో సోమవారం నారా భువనేశ్వరి బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్‌ సౌజన్యంతో బ్లడ్‌బ్యాంక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఈ ప్రాంత ప్రజలు అందించిన సహకారం మరువలేనిద‌న్నారు. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇది నాలుగో బ్లడ్ బ్యాంక్ అని, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4 లక్షల 8 వేల మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు. ఎన్టీఆర్ సుజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com