ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి నుంచి విజయవాడ కి ప్రత్యేక బస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:47 PM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అనకాపల్లి నుంచి పలు ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఏడీఎం రవిచంద్ర తెలిపారు. అనకాపల్లి నుంచి విజయవాడ వెళ్లి తిరిగి అనకాపల్లి చేరుకునేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.900లు చార్జీ వసూలు చేస్తామన్నారు.


అలాగే అనకాపల్లి నుంచి విజయవాడ, ద్వారకాతిరుమల, తిరిగి అనకాపల్లికి రూ.950లు, అనకాపల్లి నుంచి విజయవాడ, ద్వారకాతిరుమల, ద్వారపూడి మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,000, అనకాపల్లి నుంచి భద్రాచలం, విజయవాడ, ద్వారకాతిరుమల మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,220లు, అనకాపల్లి నుంచి భద్రాచలం, పర్ణశాల, విజయవాడ, ద్వారకాతిరుమల, ద్వారపూడి మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,300 చార్జీ వసూలు చేస్తామన్నారు. పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com