ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:32 PM

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాలు... నర్సీపట్నం నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు తాబేళ్లు రవాణా చేస్తున్నారని చిత్రకొండ అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని రాజుకొండ చెక్‌పోస్టు వద్ద రేంజ్‌ అధికారి బన్మాలి నాయక్‌ సిబ్బందితో నిఘా పెట్టారు.


సోమవారం మధ్యాహ్న సమయంలో అటుగా వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా థర్మాకోల్‌ బాక్సుల్లో 500 తాబేళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తాబేళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు చిత్రకొండ అటవీ శాఖాధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com