ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:24 PM

స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్‌ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది.
సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు ట్రిప్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com