ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ భవిష్యత్ విజన్ కోసం సలహాలివ్వండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 07:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు.. ఎక్స్ (ట్విట్టర్)‌లో ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను swarnandhra.ap.gov.in/Suggestions ద్వారా పంపాలని కోరారు. ఇలా అభిప్రాయాలు, సూచనలు చేసిన అనంతరం అభినందనలను ఈ-సర్టిఫికెట్‌ ద్వారా అందుకోవచ్చని తెలిపారు. 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని.. స్వర్ణాంధ్రప్రదేశ్‌@2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నామని.. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి.


ఏపీలో మరో 15 రోజుల్లో టూరిజం పాలసీ తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జీఎస్‌డీపీలో పర్యాటక రంగం వాటా 15-20% ఉండాలని.. అలాగే విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మూడోస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హోటళ్లపై తమ ప్రభుత్వంలో దాడులు ఉండవని.. రాష్ట్రానికి వచ్చే అతిథులను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకోవాలన్నారు.


అంతేకాదు భూముల కేటాయింపు, విద్యుత్తు, పన్నుల్లో రాయితీ ఇవ్వబోతున్నాం. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. సముద్ర తీరప్రాంతాల్లో 283 బీచ్‌లను అభివృద్ధి చేస్తామని.. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రకాశం బ్యారేజీ దగ్గర త్వరలో సీప్లేన్‌ సర్వీసు ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్రం ప్రభుత్వ పథకాలైన స్వదేశ్‌ దర్శన్, ప్రసాదం, ఛాలెంజ్డ్‌ బేస్డ్‌ ప్రోగ్రాం ద్వారా ఏపీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి దుర్గేష్ఋతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. అంతేకాదు ట్రైన్‌ కం రోడ్డు ప్యాకేజీకి ఐఆర్‌సీటీసీ, ఏపీటీడీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇటు కర్నూలు జిల్లా ఆదోనిలో రూ.100 కోట్లతో నిర్మించిన విమలా రెసిడెన్సీ ఫైౖవ్‌స్టార్‌ హోటల్‌తో పాటుగా.. చంద్రగిరి, అనకాపల్లిలోని బొజ్జలకొండపై సౌండ్స్, లైటింగ్‌ షోలను కూడా వీరు ప్రారంభించారు. మరోవైపు ఏపీ వరద బాధితులకు విరాళాలు అందుతున్నాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20 కోట్ల విరాళం అందజేసింది. ఐటీసీ గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌పురీ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ రూ.2 కోట్లు అందజేసింది. సాగర్‌ గ్రంథి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్ రూ. కోటి విరాళం ఇచ్చారు. ఆర్కియన్‌ ఫౌండేషన్‌ (ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌) నిర్వాహకులు రూ.కోటి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, హాస్పిటల్‌ ఛైర్మన్‌ గన్ని భాస్కరరావు రూ.కోటి ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com