ఉత్తర్ ప్రదేశ్లో కల్తీ మద్యం వ్యాపారంలో నిమగ్నమై ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనికోసం 15 రోజులపాటు ఎక్సైజ్, పోలీస్ విభాగాల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన సూచించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయిల పరిహారాన్ని ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే కల్తీ మద్యం తాగి ఆసుపత్రి పాలైన వారికి చికిత్స నిమిత్తం 50 వేల రూపాయిల పరిహారాన్ని ఆయన ప్రకటించారు.