ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో టీ20లో భారత్ విజయం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 03:29 PM

న్యూజిలాండ్ తొ జరుగుతున్న మూడు టి20ల సిరీస్ లో ఈ రోజిక్కడ జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టి20లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన రెండో మ్యాచ్ లో భారత్ పుంజుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. భారత్ బ్యాట్స్ మన్ లో రోహిత్ శర్మ 50 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో ధోనీ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com