న్యూజిలాండ్ తొ జరుగుతున్న మూడు టి20ల సిరీస్ లో ఈ రోజిక్కడ జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టి20లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన రెండో మ్యాచ్ లో భారత్ పుంజుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. భారత్ బ్యాట్స్ మన్ లో రోహిత్ శర్మ 50 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో ధోనీ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.