ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో భక్తురాలు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 07:02 PM

తిరుమల దర్శనానికి కాలినడకన వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తురాలు సరళ(43) మృతిచెందారు. పాకాల మండలం శంఖంపల్లె ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. 


తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం మండలం నుంచి భక్తుల బృందం కాలినడకన తిరుమలకు బయలుదేరింది. శనివారం రాత్రి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో వీరు సేదదీరారు. తెల్లవారుజామున తిరిగి కాలినడక ప్రారంభించారు. వీరిలో తాటిమానుపల్లెకు చెందిన సరళను గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఈమె భర్త జయపాల్‌తో కలిసి 23 ఏళ్లుగా కాలినడకన తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకునేవారు. కళ్లముందే భార్య దుర్మరణం చెందడంతో జయపాల్‌ కన్నీరు మున్నీరయ్యారు. సీఐ మద్దయ్య ఆచారి, ఎస్‌ఐ మహే్‌షబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com