ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవధకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 06:51 PM

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండల కేంద్రంలోని గోవధకు పాల్పడిన మహ్మద్‌ సమీర్‌పై కేసు నమోదు చేసినట్టు జేఆర్‌ పురం ఎస్‌ఐ చిరంజివి తెలిపారు. ఆదివారం ఉదయం మండల కేంద్రానికి సమీపాన ఒక తోటలో ఆవులను వధించి, ఆ మాంసాన్ని విక్రయిస్తున్న సమీర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఉన్న మూడు ఆవులను గోశాలకు తరలించి, గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా గోవధకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com