ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ విమర్శలు మానుకుని ప్రజలకు సేవ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 07:23 PM

 ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అన్నారు. 56వ డివిజన్‌ పాతరాజరాజేశ్వరిపేటలో ఆది వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. కూటమి నాయ కులతో కలిసి డివిజన్‌లోని ఇంటింటికి వెళ్లి వందరోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సం క్షోభంలోనూ సంక్షేమం అందించడంలో చంద్రబాబు విజయవంతమయ్యార న్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శలు మానుకుని ప్రజలకు సేవ చేయాలన్నారు. వరద విపత్తు సమయంలో కూటమి నేతలు బాధితు లకు అండగా నిలబడ్డారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి బాధితు లకు నిరంతరం అందుబాటులో ఉంటూ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. నున్నా కృష్ణ, రౌతు వాసు, ఆది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com