బుడమేరు వరద ఉదృతిలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. నష్టపోయిన బాధితులు, అలాగే రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతం వరద ముంపుకు గురవుతుందని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో అలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వైసీపీ మాటలతో మోసం చేసిందని ఎమ్మెల్యే మండిపడ్డారు.