ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... బీజేపీ వారధి కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు.