డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి బడిలో చేర్పించాలని పార్వతీపురం కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై ఆయన సమావేశం నిర్వహించారు. న్యూట్రిషన్ గార్డెన్స్, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల హాజరు, డ్రాపౌట్స్, హైస్కూల్ మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల హాజరు, డ్రాపౌట్స్, హైస్కూల్, మై ప్రైడ్, పీఎంశ్రీ స్కూల్స్ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డ్రాపౌట్స్ విద్యార్థులు నూరు శాతం ఏదో ఒక విద్యా సంస్థలో చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలను ఆదేశించారు. పాఠశాల ల్లో ప్రతినెలా విద్యార్థులకు ఎనీమియా పరీక్షలు నిర్వహించే విధంగా క్లాస్టీచర్ పర్యవేక్షణ చేయాలన్నారు. పాఠశాల్లో ప్రవేశాలు పెంచేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో జి.పగడాలమ్మ, డిప్యూటీ డీఈవోలు రాజ్కుమార్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.