ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివుని విగ్రహాన్నిధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 04:52 PM

విశాఖపట్నం జిల్లా, గొలుగొండ మండలంలోని కొత్తపాలెం గ్రామం వద్ద ఉమాధారమల్లీశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో కె.దివ్యతేజ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని పాతమల్లంపేట పంచాయతీ శివారు కొత్తపాలెం గ్రామం వద్ద ప్రఖ్యాత ఉమాధారమల్వీశ్వరస్వామి ఆలయం వుంది. ఈ ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్న శివుడి రూపంలో విగ్రహాన్ని గతంలో ప్రతిష్ఠించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ విగ్రహం వద్ద కూడా పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శివుడి విగ్రహం ముక్కు, చేతులు, తలపైఉన్న పాక్షికంగా ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గుర్తించి ఆలయ ఈవో దివ్యతేజకు ఫోన్‌కుచేసి చెప్పారు. ఆమె ధారమఠం చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సున్నితమైన ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని ఎస్‌ఐ రామారావును కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com