ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపు-కుంకుమ భగ్నం చేసేందుకు వైసీపీ కుట్రలు : యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 04, 2019, 02:37 PM

పసుపు-కుంకుమ సభలను భగ్నం చేసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.  చెక్కులు చెల్లవని వైసీపీ దుష్ప్రచరం చేస్తోందన్నారు. చెల్లకపోవడానికి ఇది జగన్ దొంగ సొమ్ము కాదన్నారు. బ్యాంకుల్లో రూ.2,350కోట్లు డిపాజిట్ చేశామన్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ రూ.4100కోట్లు విడుదల చేసిందన్నారు.  కేంద్రంలో మోడీ పాలనపై ఆర్థిక మంత్రి యనమల  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐతో రాష్ట్ర ప్రభుత్వంపై దాడులు గర్హనీయమన్నారు. సీఎం రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేసే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఇది పరాకాష్టన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై మోదీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని యనమల అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com