శారద కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ను ప్రశ్నించటానికి వెళ్లిన సీబీఐ అధికారులను అక్కడ పోలీసులు అరెస్టు చేసిన వివాదంపై సీబీఐ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. శారద కుంభకోణం కేసుకు సంబంధించి సాక్ష్యాలను కమిషనర్ ధ్వంసం చేస్తున్నారని, కమిషనర్ వెంటనే లొంగిపోవాల్సిందిగా ఆదేశించాలని తుషార్ తన పిటిషన్లో కోరారు. దీనికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కమిషనర్ రాజీవ్కుమార్పై ఆరోపణలకు సంబంధించి ఎలాంటి రుజువులు లేనందున వెంటనే విచారణ చేపట్టలేమని, మంగళవారం విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.