ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 01:41 PM

చిత్తూరులో  ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. హరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హరి హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కార్ పార్కింగ్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే చిత్తూరు టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హరి ఆత్మహత్యకు ముందు అతని డ్రైవర్‌కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు రావాల్సిన అప్పులు రాకపోవడం, తను చెల్లించాల్సిన అప్పులు వారికి చెల్లించకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com