ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఖరీఫ్‌ ముందే చెరువుల్లో సాగు నీరు సిద్ధం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 12:46 PM

ఉత్తరాంధ్రలోని జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని గరివిడి రోడ్డులో గల ఆంజనేయపురంలో ఏర్పాటుచేసిన టీడీపీ కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషితోనే పోలవరం ప్రాజక్టుకు కేంద్రం నుంచి రూ.12వేల కోట్ల పైచిలుకు నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యిందన్నారు. అదే విధంగా కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం కూడా విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట సమీపంలో ఏర్పాటవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. నియోజవర్గంలో ఉన్న సుమారు 4 వేల చెరువులను తోటపల్లి ద్వారా నింపేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జీవో విడుదల చేశారని ఆయన తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ ముందే చెరువుల్లో సాగు నీరు సిద్ధం చేసుకుందా మన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com