ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:42 PM

భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితకు వినతిపత్రం అందజేశారు. సంఘం కల్లూరు నగర అధ్యక్షుడు సుధాకరప్ప మాట్లాడుతూ ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం బిల్డింగ్‌ వర్కర్స్‌ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు వాడుకుని రూ.925 కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యేకు వినతి ఇచ్చిన వారిలో నరసింహులు, రాధాకృష్ణ, జి.ఏసు, అబ్దుల్‌ రహమాన, శ్రీనివాసులు, మౌలాలి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com