ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ విదేశీపర్యటనకి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 10:05 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. మే17 నుంచి జూన్1 వరకు ఆయన విదేశాల్లో పర్యటించారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటించారు. మూడు నెలల పరిధిలో రెండోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఇటీవల కాలంలో జగన్ బెంగళూరులో సైతం ఎక్కువుగా ఉంటున్నారు. వారంలో మూడు రోజులు బెంగళూరులో ఉంటే.. మిగతా రోజులు తాడేపల్లిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. వాస్తవానికి 15రోజులకు పైగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసినప్పటికీ.. జగన్ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com