ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 09:42 PM

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘నా దగ్గరి వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారు.. ఈ పనులు ఆపండి.ఎందుకు మీరే సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోవద్దా?.. కానీ నా నియోజకవర్గంలో ఇసుక దందా వద్దు. నా కోసం ఐదు సంవత్సరాలు పని చేశారు. మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా క.. నీ ఇసుక దందా వద్దు.. నాకు దూరం కాకండి’’ అంటూ జేసీ వీడియోలో పేర్కొన్నారు.తాడిపత్రి నియోజకవర్గంలో మొత్తం 25 మంది ఇసుక దందా చేస్తున్నారని.. వారందరూ తనకు ఆప్తులన్నారు. ఐదు సంవత్సరాలుగా తనతో పాటు కష్టపడ్డారని తెలిపారు. ఇసుక దందాను మానుకోండి అని వినతి చేశారు. నియోజకవర్గంలో 2.50లక్షల మంది ఓటర్లు ఉంటే డబ్బులు కావాల్సింది కేవలం ఈ 25 మందికేనా ప్రశ్నించారు. దయచేసి దూరం చేసుకోవద్దని కోరారు. ‘‘ గత ప్రభుత్వంలో ఇసుకు అక్రమ రవాణాపై గ్రీన్‌ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లి మరీ పోరాడాను. నన్ను పట్టుకుని అన్ని ఊర్లు తిప్పి, పోలీస్‌స్టేషన్‌కు తిప్పితే.. మీ దయ వల్లే బయటకు వచ్చా. కానీ ఇసుక దందా చేసి దూరం కావొద్దు. ఇటీవల ఏసీబీ విచారణ జరిగింది. మీకు వచ్చేది ఏమీ లేదు’’ అని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com